టేకింగ్, టెక్నికల్ వాల్యూస్తో పాటు కథలు కూడా పాశ్చాత్యబాట పడుతున్న తరుణంలో మన దేశానికి సంబంధించిన రాచరిక చరిత్రను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం గొప్ప విషయం. స్టూడెంట్ నెం.1, యమదొంగ చిత్రాలతో ఎన్టీఆర్ను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి ఈసారి చిరంజీవి కుమారుడు రామ్చరణ్ను ఆ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
పరువు ప్రతిష్టల కోసం తలకాయలు నరుక్కోవడం ఫ్యాక్షనిజం అయితే, దేశాన్ని, రాజును, యువరాణిని కాపాడుకోవడం కోసం కరవాలంతో తలలు లేపేయడం వంటి రాచరిక చరిత్రతో "మగధీర" తెరకెక్కాడు.